News January 31, 2025
2న ఒంగోలులో ఆరామ క్షేత్రం ప్రారంభం
రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.
Similar News
News February 2, 2025
ఒంగోలు: పవన్ కళ్యాణ్ ఫొటో లేదని కలెక్టర్కు లేఖ
ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేశ్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలు లేవని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 1, 2025
సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్
సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 1, 2025
దొనకొండ: సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి పెన్షన్ నగదు చోరీ
దొనకొండ మండలం పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ వీరం రంగారెడ్డి దగ్గర రూ.2,64,000 పెన్షన్ నగదును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సొంతూరు చందవరం నుంచి పెద్దన్నపాలెంకు పింఛన్ పంపిణీకి వస్తుండగా బాధాపురం సమీపంలో బండి ఆపి ఉద్యోగిని కొట్టి నగదును తీసుకెళ్లారన్నారు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.