News March 2, 2025

2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు: CM

image

చిత్తూరు జిల్లాలో త్వరలోనే 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం GDనెల్లూరులో పర్యటించిన ఆయన.. NTR జలాశాయంతోపాటూ ఇక్కడే బాలుర గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు CM తెలిపారు. వాటితో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News March 4, 2025

జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు: కుప్పం DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.  

News March 3, 2025

చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

News March 3, 2025

కుప్పం : చికెన్ పట్ల అపోహలు వద్దు : ఎమ్మెల్సీ

image

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.

error: Content is protected !!