News February 13, 2025

2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : SP

image

దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.

Similar News

News March 28, 2025

NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

News March 28, 2025

టెన్త్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనం

image

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.

News March 28, 2025

2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 800 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆరుగురు DSPలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 1,500 సివిల్ పోలీస్ సిబ్బంది, 200 మంది ఆర్మ్‌డ్, 200 మంది APSP, 100 మంది స్పెషల్ పార్టీ మొత్తంగా 2 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

error: Content is protected !!