News June 4, 2024

తేజస్వి సూర్యకు 2.50 లక్షల మెజారిటీ

image

బీజేపీ యువ సంచలనం తేజస్వి సూర్య సంచలన విజయం దిశగా సాగుతున్నారు. బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన 2.50 లక్షల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. చిన్నవయసు నుంచే ఆయన RSSలో పని చేస్తున్నారు. 9 ఏళ్ల వయసులో పెయింటింగ్ వేసి, వచ్చిన డబ్బులు కార్గిల్ వీరుల కోసం డొనేట్ చేశారు.

Similar News

News January 7, 2026

పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

image

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్‌ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.

News January 7, 2026

టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

image

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.

News January 7, 2026

మౌలానా వర్సిటీ భూములు వెనక్కి తీసుకుంటే ఉద్యమమే: సంజయ్

image

TG: HYDలోని మౌలానా ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘వీటిని అమ్మి దోచుకోవాలని చూస్తున్నారు. సల్కం చెరువును ఆక్రమించి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? వాటిని ఎందుకు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు. GOVT తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వర్సిటీలో వినియోగించని 50 ఎకరాల స్వాధీనానికి గతనెల కలెక్టర్ నోటీసులిచ్చారు.