News September 17, 2025

2.83 కోట్ల చేప పిల్లల విడుదలే లక్ష్యం: కోదండ రెడ్డి

image

కామారెడ్డి జిల్లాలోని 768 చెరువులలో 100% సబ్సిడీపై 2.83 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

Similar News

News September 17, 2025

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

News September 17, 2025

VKB: స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్

image

వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం బలపడుతుందని, శిబిరం ద్వారా మహిళలకు, పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 17, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.