News April 14, 2024
పేదలకు 2 సెంట్ల స్థలం, వృద్ధులకు రూ.4వేల పెన్షన్: చంద్రబాబు

AP: తాము అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీనిచ్చారు. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని చెప్పారు. ‘తల్లికి వందనం కింద ప్రతి మహిళకు రూ.15వేలు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ హామీలు అమలు చేస్తామని పాయకరావుపేట సభలో తెలిపారు.
Similar News
News February 2, 2026
పీసీబీ ప్రకటనపై స్పందించిన ఐసీసీ

భారత్తో T20WC మ్యాచ్ను బహిష్కరిస్తామన్న <<19024958>>PCB<<>> ప్రకటనపై ICC స్పందించింది. పీసీబీ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్లోనూ క్రికెట్పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది. దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.
News February 2, 2026
కరోండా మొక్కలతో పంటకు రక్షణ, ఆదాయం

పంట రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇవి చిన్న పొద రూపంలో పెరుగుతాయి. వీటి కాండం, కొమ్మలు ముళ్లతో నిండి పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ మొక్కలకు ఉండే కాయలతో రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. కరోండాను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 2, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.


