News October 1, 2024
సర్పంచ్ పదవికి వేలంపాటలో రూ.2 కోట్లు

పంజాబ్ గురుదాస్పూర్ జిల్లాలోని హర్దోల్వాల్ కలన్ గ్రామ సర్పంచ్ ఎన్నిక సంచలనంగా మారింది. అక్కడ పోలింగ్ లేకుండా పదవి కోసం గ్రామస్థులు రూ.50లక్షలతో వేలంపాట నిర్వహించారు. బీజేపీ నేత ఆత్మా సింగ్ రూ.2 కోట్లకు పదవిని సొంతం చేసుకున్నారు. 30ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కొనసాగుతోంది. వేలంపాట నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను పలువురు విమర్శిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు.
Similar News
News December 29, 2025
ఇసుక సముద్రంలో ఒంటరిగా!

నైజర్ దేశంలోని సహారా ఎడారిలో 400KMS పరిధిలో ఒకే ఒక్క చెట్టు ఉండేది. ఎడారిలో ప్రయాణించేవారికి ఈ ‘టెనెరే వృక్షం’ ఓ దిక్సూచిలా ఉండేది. నీటికోసం భూగర్భంలోనికి తన వేళ్లను విస్తరించి ప్రాణాలు నిలుపుకుంది. ఈ చెట్టు స్థిరత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. 1973లో ఓ ట్రక్కు డ్రైవర్ చెట్టును ఢీకొట్టడంతో 300 ఏళ్ల దాని ప్రస్థానం ముగిసింది. ప్రస్తుతం దీని అవశేషాలను నైజర్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు.
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్ఫుల్-5 (₹292.5కోట్లు)
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్లో స్థిరపడింది.


