News October 1, 2024
సర్పంచ్ పదవికి వేలంపాటలో రూ.2 కోట్లు

పంజాబ్ గురుదాస్పూర్ జిల్లాలోని హర్దోల్వాల్ కలన్ గ్రామ సర్పంచ్ ఎన్నిక సంచలనంగా మారింది. అక్కడ పోలింగ్ లేకుండా పదవి కోసం గ్రామస్థులు రూ.50లక్షలతో వేలంపాట నిర్వహించారు. బీజేపీ నేత ఆత్మా సింగ్ రూ.2 కోట్లకు పదవిని సొంతం చేసుకున్నారు. 30ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కొనసాగుతోంది. వేలంపాట నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను పలువురు విమర్శిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు.
Similar News
News January 29, 2026
మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
News January 29, 2026
మేడారం జాతర.. రేపు మరో జిల్లాలో సెలవు

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగు జిల్లాలోనూ రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్తో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News January 29, 2026
జంక్ ఫుడ్పై ఆ సమయంలో ప్రచారం వద్దు: ఆర్థిక సర్వే

జంక్ ఫుడ్పై కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ యాడ్స్పై నిషేధం విధించాలని చెప్పింది. చిన్నారుల పాల ఉత్పత్తుల మార్కెటింగ్పైనా ఆంక్షలు విధించాలని పేర్కొంది. గత 14 ఏళ్లలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకాలు 150 శాతం పెరిగాయని తెలిపింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు(HFSS) కలిగిన ఆహార పదార్థాల ప్యాకింగ్పై హెచ్చరికలు ఉండాలని సూచించింది.


