News May 19, 2024

2 Hr’s పాటు నిలిచిపోయిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్

image

హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అందులో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్‌లో నిలిపివేశారు. తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేశారు. రెండు గంటలు రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.

Similar News

News December 10, 2025

ADB: 938 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీసులతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా అందులో 39 క్లస్టర్లు, 34 రూట్‌లతో 166 గ్రామాలలో 225 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 10, 2025

ADB: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. ”అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

image

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.