News October 3, 2025
ఆన్లైన్ మనీగేమ్లపై ప్రచారం చేస్తే 2 ఏళ్ల జైలు

ఆన్లైన్ మనీగేమ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. PROG Act ప్రకారం కేంద్రం draft రూల్స్ను ప్రకటించింది. OGAIకి సివిల్ కోర్టు అధికారాలు కల్పించింది. ఇకపై ఈ గేమ్లను ఆఫర్ చేస్తే 3ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా విధిస్తారు. వీటిపై ప్రచారాలు చేసే వారికి 2ఏళ్ల ఖైదు, ₹50 లక్షల ఫైన్ తప్పదు. వారెంటు లేకుండా సోదాలు, అరెస్టులూ చేయొచ్చు. పందేలు, పాయింట్లను మనీగా మార్చుకొనేలా ఉంటే మనీ గేమ్లుగా పరిగణిస్తారు.
Similar News
News October 3, 2025
మహిళల ఆరోగ్యానికి ‘ప్రోబయాటిక్స్’ బెస్ట్

శరీరానికి మేలు చేసే సజీవ సూక్ష్మజీవులనే ప్రోబయాటిక్స్ అంటారు. పులియబెట్టిన ఆహార పదార్థాల(పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, కెఫీర్)లో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. అరటి, యాపిల్, ఉల్లి, వెల్లుల్లిలోనూ లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మహిళల్లో యూరినల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, గర్భధారణ, నెలసరి, మెనోపాజ్ దశల్లో వచ్చే మూడ్ స్వింగ్స్ను అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News October 3, 2025
368 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News October 3, 2025
సారీ మమ్మీ బతకాలని లేదు: ఇట్లు నీ పింకీ

TG: పెదనాన్న వేధింపులు తాళలేక మేడ్చల్(D) కొంపల్లిలో అంజలి(17) ఆత్మహత్య చేసుకున్నారు. ‘అమ్మా నన్ను క్షమించు. బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెదనాన్న ప్రతివారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా ఉంది. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపానని నాతో అన్నాడు. పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ’ అని ఆమె సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.