News February 3, 2025
20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News November 17, 2025
అక్కడ అలా.. ఇక్కడ ‘డీలా’..!

మన్యం జిల్లాలో మారుమూల అందాలను వెలికితీస్తున్న అధికారులు.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తోటపల్లి బోటుషికారుపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ నుంచి మూడు బోట్లను తాటిపూడి తరలించడం గమనార్హం. తాటిపూడిలో బోటు షికారు జోరుగా సాగుతుంటే.. ఇక్కడ డీలా పడింది. తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో బోటు షికారు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
News November 17, 2025
రవితేజ సినిమాలో సమంత?

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.
News November 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,24,970కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పతనమై రూ.1,14,550 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,73,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


