News February 3, 2025

20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

image

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Similar News

News November 18, 2025

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

image

బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం

News November 18, 2025

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

image

బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం

News November 18, 2025

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.