News February 3, 2025

20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

image

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Similar News

News November 19, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.

News November 19, 2025

యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

image

యువత పెళ్లి కంటే కెరీర్‌పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.