News February 3, 2025
20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News July 9, 2025
JGTL: రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన యువతి

ICET-2025 ఫలితాల్లో మొత్తం 58,985 మంది ఉత్తీర్ణత సాధించగా మేడిపల్లి(M) కొండాపూర్(V)కి చెందిన వీరేశం, విజయలక్ష్మి కుమార్తె వైష్ణవి(22) రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. టాప్10లో ఇద్దరే అమ్మాయిలు ఉండగా అందులో మన మండలవాసి వైష్ణవి 5వ ర్యాంకు కొట్టింది. కాగా, ఈమె గతంలో <<16285740>>5బ్యాంకు ఉద్యోగాలు<<>> సాధించి అందరితో శెభాష్ అనిపించుకుంది. వైష్ణవి విజయాల పట్ల పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!

ఓరోజు తగ్గుతూ తర్వాతి రోజు పెరుగుతూ బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
BREAKING.. మరిపెడ మండలంలో ఎన్ఐఏ సోదాలు

MHBD జిల్లా మరిపెడ మం.లోని భూక్య తండాలో NIA సోదాలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఆ తండాలో మిర్చి ఏరడానికి వచ్చిన వ్యక్తి జిలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాన్ని తీసుకువెళ్లి తీవ్రవాదులకు అమ్ముతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఇక్కడి రైతు దగ్గర తీసుకున్నట్లు NIA అధికారులకు విచారణలో చెప్పడంతో అధికారులు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.