News November 20, 2024

20న కోటప్పకొండలో అభిషేకాల రద్దు

image

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి ఈనెల 20న గురువారం అభిషేకాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.చంద్రశేఖర రావు వెల్లడించారు. శోభాయాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి విద్యా శేఖర భారతి స్వామి త్రికోటేశ్వర స్వామికి ఆలయానికి వస్తున్నారని తెలిపారు. అభిషేక మండపాల్లో మాత్రమే స్వామివారికి అభిషేక పూజలు జరుగుతాయన్నారు.

Similar News

News February 4, 2025

నులిపురుగుల నివారణ పోస్టర్లు ఆవిష్కరించిన గుంటూరు కలెక్టర్

image

ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం నులిపురుగుల నిర్మూలన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. 1 నుంచి 19సం.ల పిల్లలకు 400mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పిరించి మింగించాలని, ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మజిదా బేగం, శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News February 3, 2025

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి

image

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో లైన్ కలుపనుంది.

News February 3, 2025

గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు

image

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).