News January 13, 2026

20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

News February 19, 2026

ఆత్మకూరులో నేడే మెగా జాబ్ మేళా

image

ఆత్మకూరు ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 25 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 1400పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జాబ్ మేళా జరగనుంది.

News February 19, 2026

ప్రభుత్వానికి కాకాణి సవాల్

image

ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ నిధులు హెరిటేజ్‌కు మళ్లించారనే అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, 22–ఏ భూముల అంశాలపై చర్చకు సిద్ధమని, ప్రభుత్వం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.