News June 10, 2024

20 ఏళ్లకు మళ్లీ కరీంనగర్‌కు కేంద్రమంత్రి పదవి

image

కరీంనగర్ పార్లమెంటుకు 20 ఏళ్ల తర్వాత కేంద్రమంత్రి పదవి వరించింది. KCR 2004 జనరల్ ఎన్నికల్లో కరీంనగర్ MP స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004-06 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకముందు 1998, 1999ఎన్నికల్లో గెలుపొందిన సీహెచ్ విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక KNR నుంచి కేంద్రమంత్రి పదవి పొందిన మొదటివ్యక్తిగా సంజయ్ నిలిచారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్‌లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్‌లో 8.14% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

image

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్‌గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్‌గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.