News January 10, 2025

20 నుంచి జిల్లాలో రీ సర్వే ప్రారంభం: జేసీ

image

కర్నూలు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద జిల్లాలో సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద రీ సర్వేపై జిల్లాలోని RSDTలు, మండల సర్వేయర్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

Similar News

News November 16, 2025

కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 16, 2025

కర్నూలు: 675 మందిపై కేసులు

image

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.

News November 16, 2025

అంగన్వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సిరి

image

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలని సీడీపీఓలను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరచి, పిల్లల ఎత్తు, బరువు ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. తల్లులకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా పోషకాహారంపై వీడియోలు పంపాలని ఆమె సూచించారు.