News October 19, 2024

20 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి 

image

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు.

Similar News

News December 12, 2025

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక: అదనపు కలెక్టర్

image

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదల కోసం పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని సూచించారు.

News December 12, 2025

బోనకల్ సర్పంచ్‌గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

image

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

News December 12, 2025

ఖమ్మం: నేటితో రెండో విడత ప్రచారం ముగింపు

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం వంటి 6 మండలాల్లో అభ్యర్థులు చివరి రోజు ఇంటింటి ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.