News January 29, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: జీసీసీ ఛైర్మన్

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంతగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని దుయ్యబట్టారు. దానికి భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News December 14, 2025
భవానీ దీక్షల విరమణ.. 3.75 లక్షల మంది అమ్మవారి దర్శనం

భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ నెల 11 నుంచి సుమారు 3.75 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. భక్తులకు దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, ఉచిత రవాణా వంటి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఆయన వెంట ఈవో శీనా నాయక్ ఉన్నారు.
News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @1PM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా 1PM గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 83.9% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 79.6%, కొత్తకోట 84.5%, మదనాపూర్ 86.2%, ఆత్మకూరు 83.8%, అమరచింత 89.2% పోలింగ్ నమోదైంది.
News December 14, 2025
MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.


