News November 21, 2024
20 వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణమైన పరిస్థితులు: ఎమ్మెల్యే కాలవ

వెనుకబడిన ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం అని ఎమ్మెల్యే శ్రీనివాసులు అసెంబ్లీలో పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారి అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని, కానీ నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణ పరిస్థితులున్నాయన్నారు. సినిమాల్లో ఎడారి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించుకుంటారన్నారు. అలాంటి ఎడారీకర నివారణ కోసం నిధులు కేటాయించాలని కోరగా, ‘ఎడారీకరణ మంచి పదం’ అని Dy స్పీకర్ కితాబిచ్చారు.
Similar News
News October 26, 2025
అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News October 26, 2025
మోంతా ఎఫెక్ట్: అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో అనంతపురం జిల్లా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర వేళ 85002 92992 నంబరుకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తుఫాను పర్యవేక్షణ కోసం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వడరేవు వినయ్ చంద్ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.
News October 26, 2025
Pic Of The Day

తాడిపత్రి పరిసరాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ స్థలంగా మారుతున్నాయి. ఆలూరు కోన దేవస్థానం, జలపాతం, ఓబులేసు కోన ఘాట్ రోడ్లు తిరుమల దారులను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి కనిపించే పచ్చని కొండలు, పంట పొలాలు తాడిపత్రి అందాలను మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి. సెలవుల్లో ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ప్రకృతి అందాలు, పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.


