News February 19, 2025

20 సూత్రాల అమలుపై నేడు సమీక్ష

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 20 సూత్రాల అమలుపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరుగుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎంపీతో పాటు అందరు ఎమ్మెల్యేలు పాల్గొంటారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News October 21, 2025

ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

image

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News October 21, 2025

H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.

News October 21, 2025

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

image

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.