News June 26, 2024
భూముల విలువ 20%-40% శాతం పెంపు?
TG: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ 20% నుంచి 40% పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై అధ్యయనం పూర్తి చేసిన అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖకు నివేదికలు అందించారు. దీనిపై ఆ శాఖ సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని సమచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో పెంపు అంశం వాయిదా పడొచ్చనే అభిప్రాయాలున్నాయి.
Similar News
News October 10, 2024
TATA: పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం..!
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి మరో బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన చిన్నప్పుడే తండ్రి నావల్ టాటా నుంచి తల్లి సోనో విడిపోయారు. తన నానమ్మ నవాజ్ బాయ్ వద్దే ఆయన పెరిగారు. కొంతకాలానికి ఆయన తల్లి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై టాటాను స్కూళ్లో తోటి విద్యార్థులు అవహేళన చేసేవారు. ఆ అవమానాలే ఆయన వివాహం చేసుకునేందుకు అడ్డు వచ్చాయని అంటారు.
News October 10, 2024
నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!
దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లా లాహర్ నగర్లో రతన్గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.
News October 10, 2024
రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.