News July 10, 2025
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
Similar News
News July 10, 2025
భర్తతో విడాకులంటూ ప్రచారం.. స్పందించిన నయనతార

భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. ‘మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే’ అని భర్త విఘ్నేశ్తో తీసుకున్న ఫొటోను ఇన్స్టాలో స్టోరీగా పెట్టారు. వీరికి 2022లో పెళ్లి కాగా ఇద్దరు కుమారులు(ట్విన్స్) ఉన్నారు. విఘ్నేశ్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లిరిసిస్ట్గా ఉన్నారు. ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు.
News July 10, 2025
మీ తరగతికి వచ్చి సీఎం క్లాస్ చెబితే?

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులకు <<17015895>>పాఠాలు<<>> బోధించారు. అయితే, ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తరగతి గదిలోకి వెళ్లి పాఠం చెప్పడం చాలా అరుదు. ఒక వేళ మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇలాగే ఓ సీఎం వచ్చి మీకు క్లాస్ చెబితే ఎలా ఫీల్ అవుతారు? అలాగే, మీ స్కూల్లో ఏ మార్పులు చేస్తే బాగుంటుందని ఆయన్ను కోరతారు? కామెంట్ చేయండి.
News July 10, 2025
కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. గోదావరి జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చ జరగనుంది.