News May 25, 2024
శ్రీవారి దర్శనానికి 20 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు నిలుచున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 70,668 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. 38,036 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.64 కోట్లు లభించింది. కాగా ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు జూన్ 30 వరకు బ్రేక్ దర్శనం <<13307149>>రద్దు<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
సేమ్ రింగ్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్!

సమంత-రాజ్ పెళ్లి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లపాటు రిలేషన్ను కొనసాగించిన ఈ జంట ఈ నెల 1న <<18438537>>ఒక్కటైంది<<>>. అయితే రాజ్తో ఫిబ్రవరిలోనే ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తోంది. వాలంటైన్స్ డేకు ముందు రోజు(FEB 13) పోస్ట్లో, తాజాగా పెళ్లి ఫొటోల్లోనూ ఒకే రింగ్ కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా వీరి రిలేషన్ గురించి పలు సందర్భాల్లో ఫొటోలతో హింట్ ఇచ్చారు.
News December 3, 2025
నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News December 3, 2025
బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.


