News October 19, 2024

నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: మార్పు కావాలనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుకే ప్రతి నియోజకవర్గానికి 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నొక్కి చెప్పారు. అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Similar News

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే: బండి సంజయ్

image

TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘గ్రూప్-1 రద్దు చేయమని అడగట్లేదు. వాయిదా వేయాలని కోరుతున్నాం. జీవో 29తో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని అభ్యర్థులు భయపడుతున్నారు. అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే. వారిపై లాఠీఛార్జ్ జరగడం చూసి బాధనిపిస్తోంది’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

News October 19, 2024

తప్పు చేయలేదు..క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: సల్మాన్ తండ్రి

image

తన కొడుకు కృష్ణజింకల్ని ఎప్పుడూ చంపలేదని నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. ‘కృ‌ష్ణజింకల్ని కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకల్ని చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

News October 19, 2024

IAS అధికారి అమోయ్‌కు ఈడీ నోటీసులు

image

తెలంగాణకు చెందిన IAS అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు పంపింది.