News February 19, 2025
20 సూత్రాల అమలుపై నేడు సమీక్ష

శ్రీ సత్యసాయి జిల్లాలో 20 సూత్రాల అమలుపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరుగుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎంపీతో పాటు అందరు ఎమ్మెల్యేలు పాల్గొంటారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 15, 2025
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మృతి

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ రైనర్ (78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ (68) దారుణ హత్యకు గురయ్యారు. US లాస్ ఏంజెలిస్లోని వారి ఇంట్లో రక్తపుమడుగులో పడి కనిపించారు. సొంత కుమారుడే వారిని చంపారని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. నటుడిగా ఆయన రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. దర్శకుడిగా ‘When Harry Met Sally’, ‘Misery’, ‘A Few Good Men’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు.
News December 15, 2025
వరంగల్: ఇక ప్రాదేశిక స్థానాలపై కన్ను..!

జిల్లాలో రెండు విడుతల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, నాయకులు ప్రాదేశిక స్థానాలపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలను చేపట్టారు. ప్రాదేశిక స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News December 15, 2025
ఎంపీ, ఎమ్మెల్యేల సొంతూళ్లలో గెలుపెవరిదంటే?

TG: మహబూబ్నగర్ MP డీకే అరుణ(BJP), నారాయణపేట MLA చిట్టెం పర్ణికారెడ్డి(INC) పుట్టిన ఊరు ధన్వాడ. వరుసకు అత్తాకోడళ్లు అయ్యే వీరు సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ పోరులో INC బలపర్చిన చిట్టెం జ్యోతిపై BJP మద్దతుదారు జ్యోతి 617 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహబూబ్నగర్(D) దేవరకద్ర MLA మధుసూదన్ రెడ్డి స్వగ్రామం దమగ్నాపూర్లో BRS బలపర్చిన పావని కృష్ణయ్య 120 ఓట్లతో విజయం సాధించారు.


