News April 4, 2024
AI సిటీకి 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్బాబు

TG: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. సైబర్ టవర్స్లో టెక్ హబ్ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ‘త్వరలో AI సిటీ కోసం 200 ఎకరాలు కేటాయిస్తాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తాం. హైదరాబాద్ వేదికగా జులైలో AIపై సదస్సు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
Similar News
News September 16, 2025
కవిత రాజీనామా ఆమోదంపై సస్పెన్స్!

TG: బీఆర్ఎస్ మాజీ నేత కవిత MLC పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావొస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ లోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
News September 16, 2025
దీర్ఘకాలిక సంతోషానికి ఈ అలవాట్లు

* రోజూ 30 ని.ల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా, సైక్లింగ్) చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లు పెరుగుతాయి.
*7-9 గంటల నాణ్యమైన నిద్ర వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగై, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ధ్యానం చేయాలి.
* కుటుంబం, స్నేహితులు, సమాజంతో సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సంతోషాన్ని పొందవచ్చు.
* ఇతరులకు సహాయం చేయడం వల్ల పొందే సంతోషం, తమ కోసం ఖర్చు చేయడం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
News September 16, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.