News February 2, 2025

3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్

image

2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Similar News

News November 27, 2025

R.G.L- 7034 వరి రకం ప్రత్యేకతలు

image

R.G.L- 7034 సన్నగింజ వరి రకం. మొక్క ఎత్తు 100-105 సెం.మీ. దుబ్బుకు 10 నుంచి 14 పిలకలు వస్తాయి. వెయ్యి గింజల బరువు 14.5 గ్రాములు. చిట్టిముత్యాలు, NLR 34449 రకాలను క్రాసింగ్ చేసి R.G.L- 7034ను అభివృద్ధి చేశారు. బలమైన వేరు వ్యవస్థ కలిగి తుఫాన్ సమయంలో పడిపోలేదు. గింజ రాలడం తక్కువ. కాండం దృఢంగా ఉంటుంది. ఉల్లికోడు, దోమపోటు, మానిపండు తెగుళ్లను తట్టుకుంటుంది. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి వస్తుంది.

News November 27, 2025

R.G.L- 7034 వరి రకం ప్రత్యేకతలు

image

R.G.L- 7034 సన్నగింజ వరి రకం. మొక్క ఎత్తు 100-105 సెం.మీ. దుబ్బుకు 10 నుంచి 14 పిలకలు వస్తాయి. వెయ్యి గింజల బరువు 14.5 గ్రాములు. చిట్టిముత్యాలు, NLR 34449 రకాలను క్రాసింగ్ చేసి R.G.L- 7034ను అభివృద్ధి చేశారు. బలమైన వేరు వ్యవస్థ కలిగి తుఫాన్ సమయంలో పడిపోలేదు. గింజ రాలడం తక్కువ. కాండం దృఢంగా ఉంటుంది. ఉల్లికోడు, దోమపోటు, మానిపండు తెగుళ్లను తట్టుకుంటుంది. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి వస్తుంది.

News November 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 79

image

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>