News February 2, 2025

3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్

image

2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Similar News

News November 16, 2025

పంచాయతీ నిధుల వివరాలు తెలుసుకోండిలా!

image

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఖర్చులను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అయితే ‘e-Gram Swaraj’ <>పోర్టల్<<>> ద్వారా గ్రామ పంచాయతీలు.. వాటి నిధులు-ఖర్చుల వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక సంఘం ఏటా విడుదల చేసే నిధులు, పథకాల నిధులు, వాటి వినియోగ వివరాలను ట్రాక్ చేయొచ్చు. వార్షిక ప్రణాళికలూ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం PR పోర్టల్ చెక్ చేయాలి. share it

News November 16, 2025

కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

image

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్‌కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.

News November 16, 2025

అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

image

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్‌నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.