News September 9, 2024

ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు 2,000 మంది పోలీసులు

image

ఫిలిప్పీన్స్‌లో అపోలో అనే పాస్టర్ దావోవ్ సిటీలో 75ఎకరాల్లో ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట ఓ సామ్రాజ్యం స్థాపించారు. సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు వ్యక్తిగత సహాయకులనూ లైంగికంగా వేధించారని అభియోగాలున్నాయి. దీంతో దాదాపు 2వారాల ఆపరేషన్ తర్వాత ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 2,000 మంది పోలీసులు ఓ బంకర్‌లో దాక్కొన్న అపోలోను అరెస్ట్ చేశారు. హెలికాప్టర్లను కూడా వాడారు.

Similar News

News February 3, 2026

ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం

image

భారత్‌పై ప్రతీకార టారిఫ్‌లను 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ప్రపంచశాంతికి ట్రంప్ నాయకత్వం కీలకమని xలో ట్వీట్ చేశారు.

News February 3, 2026

భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: ట్రంప్

image

భారత్‌పై టారిఫ్‌ల తగ్గింపునకు ప్రతిఫలంగా.. అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుందని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, వ్యవసాయ, బొగ్గు, సాంకేతిక ఉత్పత్తుల కొనుగొలుకు మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. దీని వల్ల భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు.

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.