News October 20, 2024
2001 నాటి రోజులు గుర్తొస్తున్నాయి: హరీశ్ రావు

మానకొండురు మాజీ MLA రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం చూస్తే 2001 నాటి రోజులు గుర్తు వస్తున్నాయని, ఆ స్పూర్తి కనిపిస్తున్నదనీ హరీష్ అన్నారు. రసమయి కూడా అలయ్ బలయ్ పేరిట తన పాట పేరిట కాంగ్రెస్ మీద పోరాటానికి ఆయుధం విసిరిండని పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
మొదటిసారిగా కరీంనగర్లో..!

కరీంనగర్లో మొదటిసారిగా ఏ- డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్ జరగనుంది. అలుగునూరులోని వెల్చల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ చారిత్రాత్మక పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో హైదరాబాద్ వెలుపల అధికారిక ఏ- లెవల్ లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది.
News October 27, 2025
KNR: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

KNR నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు KNR 1 DM విజయమాధురి తెలిపారు. NOV 3న KNR బస్టాండ్ నుంచి సా.4 గంటలకు బయలుదేరి NOV 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం NOV 5న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత NOV 6న సాయంత్రం వరకు బస్సు KNRకు చేరుకుంటుందని చెప్పారు. వివరాలకు 9959225920ను సంప్రదించాలన్నారు.
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.


