News January 13, 2025
2018లోనే గ్రీన్కో ప్రాజెక్ట్కు ఆమోదం: TG

పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని YCP నేతలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి TG భరత్ స్పందించారు. ‘2018లోనే TDP ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడానికి జగన్ కృషే కారణమని కొందరు చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జగన్ తన పదవీ కాలంలో కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాండి’ అని మంత్రి అన్నారు.
Similar News
News September 16, 2025
కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.
News September 15, 2025
పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.
News September 15, 2025
ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.