News November 26, 2025
2019 ఎన్నికల్లో జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2019 ఎన్నికల్లో 41 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవ ఎన్నిక జరిగే పంచాయతీలకు రూ.10లక్షల ప్రోత్సాహకం ఇస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో 41 గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పదవీకాలం ముగిసినా ప్రోత్సాహకం మాత్రం పంచాయతీలకు అందలేదు. తాజాగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున అందజేస్తామని ఓ మీటింగ్లో మంత్రి తుమ్మల చెప్పినా ఏకగ్రీవంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
Similar News
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.
News November 26, 2025
రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందిస్తారా?: కేటీఆర్

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల <<18387531>>తగ్గింపు<<>>, డబ్బు దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే 24 నుంచి 17 శాతానికి తగ్గించారు. దీనిపై రాహుల్ స్పందించే అవకాశం ఉందా?’ అని ట్వీట్ చేశారు.
News November 26, 2025
జీకేవీధి: సీలేరు మార్కెట్ సెంటర్లో హీరో రవితేజ సందడి

జీకేవీధి మండలం సీలేరులో ప్రముఖ సినీ హీరో రవితేజ సందడి చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు. రవితేజ, ప్రియా భవానీశంకర్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా షూటింగ్ సీలేరులో జరుగుతోంది. మార్కెట్లోని పండ్ల దుకాణం, స్వీట్ షాప్, జోళ్ల షాప్ వద్ద పలు సన్నివేశాలు చిత్రీకరించారు.


