News March 30, 2025

202 మందికి నేడు ఉగాది పురస్కారాలు

image

AP: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేడు 202 మందికి CM చంద్రబాబు పురస్కారాలు అందజేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. పలు రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్న అవార్డు గ్రహీతలను రూ.50వేల నగదు, హంస ప్రతిమ, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10వేల నగదు, మెమెంటో అందిస్తారు.

Similar News

News September 9, 2025

నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

image

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.

News September 9, 2025

కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల పూజలు.. పిక్స్ వైరల్

image

డేటింగ్ రూమర్స్ వేళ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో హీరోయిన్ శ్రీలీల వినాయక చవితి పూజలు చేశారు. ఈ వేడుకలకు శ్రీలీల తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తీక్-శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు.

News September 9, 2025

రివర్స్ వాకింగ్ చేస్తే ప్రయోజనాలు ఇవే!

image

రివర్స్ వాకింగ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘వెనక్కి నడవడం వల్ల ముందుగా కాలి వేళ్ల భాగం, ఆ తర్వాత పాదం మొత్తం నేలకు ఆనుకుంటుంది. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యి బరువు తగ్గొచ్చు. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్ను నొప్పి, మెడనొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది’ అని చెబుతున్నారు.