News December 30, 2024

2024లో మారిన నెల్లూరు రాజకీయ ముఖచిత్రం

image

2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Similar News

News December 15, 2025

నెల్లూరులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

image

నెలూరులో సోమవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ.. వాజ్‌పేయి చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు.

News December 15, 2025

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరజీవి

image

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన మరణంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పడమటి పల్లి ఆయన పూర్వీకుల స్వగ్రామం కావడంతో అమరజీవి గౌరవార్థం ఆయన పేరు నెల్లూరు జిల్లాకు పెట్టారు.

News December 15, 2025

నెల్లూరు ర్యాలీలో YCP నేతకు అస్వస్థత

image

నెల్లూరు పార్లమెంట్ YSRCP పరిశీలకులు వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితం వైసీపీ నేతలు VRC వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన మాజీ ఎమ్మెల్యేలు ఆయన్ను చేతులు మీద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు.