News December 31, 2024

2024లో విజయాలతోనే రవాణా శాఖ ముగింపు: మంత్రి

image

2024 సంవత్సరం రవాణా శాఖ విజయాలతోనే ముగుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణను తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత సాధించినట్లు తెలిపారు.

Similar News

News January 13, 2025

ఒకే వేదికపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు

image

నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.

News January 13, 2025

KNR: పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. వీటిని ఎందుకు పోస్తారో తెలుసా..? రేగు పండ్లనే భోగి పండ్లుగా పిలుస్తారు. వీటికి అర్కఫలం అనే పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు. వీటిని ఐదేళ్ల లోపు పిల్లల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.

News January 13, 2025

జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం: పెద్దపల్లి ఎమ్మెల్యే

image

ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.