News December 31, 2024
2024.. ఇక సెలవు

ఎన్నో ఆశలు, ఆశయాలతో మనం స్వాగతం పలికిన 2024 మరికొన్ని గంటల్లో మనల్ని విడిచి వెళ్లిపోనుంది. 366(లీప్ ఇయర్) రోజులుగా మనతోనే ఉంటూ, కొందరికి తీపి జ్ఞాపకాలను, మరికొందరికి చేదు గుళికలను మిగిల్చింది. బుల్లెట్ కంటే స్పీడ్గా, రాకెట్ కంటే వేగంగా 2024 అప్పుడే అయిపోయిందా? అనేలా మనందరికీ సైన్ ఆఫ్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మీకు ఎలాంటి మెమొరీస్ అందించిందో కామెంట్ చేయండి. GOOD BYE 2024
Similar News
News November 1, 2025
వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.
News November 1, 2025
మీ కొడుకుని సూపర్ హీరోగా పెంచండి!

ప్రస్తుత టెక్యుగంలో పిల్లలు మంచి కన్నా చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వారికి చిన్నప్పటి నుంచే మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. తోటివారిని గౌరవించడం, ఇతరుల వద్దకు వెళ్తే అనుమతి అడగడం, ఓర్పుతో ఉండటం, నిజాయతీగా మెలగడం వంటివి నేర్పాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పట్ల గౌరవం, సహానుభూతి చూపడం మంచి లక్షణాలని చెప్పండి. న్యాయం కోసం నిలబడే గుణాలను నేర్పిస్తే ఆదర్శవంతుడిగా ఎదుగుతాడు.
News November 1, 2025
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.


