News January 1, 2025

అత్యంత వేడి సంవత్సరంగా 2024: IMD

image

భారత్‌లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుంచి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 2016లో 0.54 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వగా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోప్ ఏజెన్సీలు తెలిపాయి.

Similar News

News December 16, 2025

ప్రముఖ నటుడిని చంపింది కొడుకే?

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రైనర్(78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్(68)లను వారి కుమారుడు నిక్ రైనర్ <<18569745>>హత్య<<>> చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిక్ కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసై పేరెంట్స్‌తో కాకుండా గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. హత్యకు ముందు కూడా హాలిడే పార్టీలో రాబ్‌తో నిక్ గొడవపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన హాలీవుడ్‌లో విషాదం నింపింది.

News December 16, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 16, 2025

EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

image

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్‌ షా గుర్తుచేశారు.