News January 1, 2025
అత్యంత వేడి సంవత్సరంగా 2024: IMD

భారత్లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుంచి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 2016లో 0.54 డిగ్రీ సెల్సియస్ నమోదవ్వగా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోప్ ఏజెన్సీలు తెలిపాయి.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


