News December 30, 2025

2025: కడప జిల్లాలో పెరిగిన మృతుల సంఖ్య

image

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో 699 ఘోర, సాధారణ రోడ్డు ప్రమాద కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 351 మంది మృతి. 781 మంది గాయపడ్డారు. 2024లో 633 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. 316 మంది మృతిచెందారు. 716 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

image

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.

News December 31, 2025

కడప: ‘ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ’

image

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగసుధ పేర్కొన్నారు. దువ్వూరులోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరాయిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

News December 31, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13,745
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,645
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,350