News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

*Jan 8: తిరుపతిలో తొక్కిసలాట – ఆరుగురు మృతి
*Feb 22: SLBC టన్నెల్ ప్రమాదం – 8 మంది మృతి
*Apr 30: సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి
*May 18: చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం-17 మంది మృతి
*June 30: సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు-54 మంది మృతి
*Oct 24: కర్నూలు వద్ద బస్సు దగ్ధం – 19 మంది మృతి
*Nov 1: పలాసలోని ఆలయంలో తొక్కిసలాట-9 మంది మృతి
*Nov 3: చేవెళ్ల బస్సు ప్రమాదం – 19 మంది మృతి
Similar News
News February 21, 2026
లొంగు‘బాట’లో దేవ్జీ?

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.
News February 21, 2026
ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://angrau.ac.in/
News February 21, 2026
చర్మానికి బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్కి వెళ్లి చాలామంది స్కిన్కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.


