News December 22, 2025
2025@ విషాదాల సంవత్సరం

2025 భారత్కు మర్చిపోలేని విషాదాలను మిగిల్చింది. కరూర్ (తమిళనాడు), తిరుపతి, ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, ప్రయాగ్రాజ్ కుంభమేళాల్లో జరిగిన తొక్కిసలాటలు, గోవా క్లబ్ అగ్ని ప్రమాదం, SLBC సొరంగం కుప్పకూలిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. పహల్గాం ఉగ్రదాడి ఉలిక్కిపడేలా చేసి ఆపరేషన్ సిందూర్కు దారి తీసింది. జూన్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, వెంటనే వచ్చిన వరదలు వందల మంది ప్రాణాలు తీశాయి.
Similar News
News December 22, 2025
పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.
News December 22, 2025
మినుము, పెసర.. 20 రోజులు దాటాకా కలుపు నివారణ

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
News December 22, 2025
యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ ఇదే!

అఫ్గాన్లో బాలికల విద్యపై ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఎలిస్ బ్లాంచర్డ్ తీసిన చిత్రానికి యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. మారుమూల గ్రామంలో ఓ ఇంట్లో చదువుకుంటున్న హజీరా(10) ఫొటో ఇందుకు ఎంపికైంది. తాలిబన్ల పాలనలో బాలికలు స్కూలుకు వెళ్లడం నిషేధం. దీంతో 22 లక్షల మంది అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిలో హజీరా ఒకరు. అఫ్గాన్లో బాలికలకు విద్య అసాధ్యమైన కలగా మారిందని యూనిసెఫ్ పేర్కొంది.


