News December 16, 2025
2026 ఏప్రిల్ నుంచి విశాఖలో ఏఐ (AI) ట్రాఫిక్ సిస్టమ్

విశాఖను ప్రపంచ స్థాయి ఆదర్శ పోలీసింగ్ నగరంగా మార్చేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ‘సెవెన్ డ్రీమ్స్’ (Seven Dreams) ప్రణాళికను ప్రకటించారు. వీసీఎస్సీ (VCSC) సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 ఏప్రిల్ నాటికి ఏఐ (AI) ట్రాఫిక్ వ్యవస్థ, మహిళా రక్షణ, హోమ్ గార్డుల సంక్షేమం, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు, బీచ్ భద్రత, బాలికలకు హెచ్పీవీ టీకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
Similar News
News December 19, 2025
అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్లో ఉద్యోగి ల్యాండ్

నేవీ ఉద్యోగి పారాచూట్పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.
News December 19, 2025
బురుజుపేట: అమ్మవారిని దర్శించుకున్న 10 లక్షల మంది

మార్గశిరమాసం కనకమహాలక్ష్మి అమ్మవారి నెలరోజులు దర్శనాలు విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిశాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారన్నారు. 10 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. మహా అన్నదానంలో 20వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేశామని చెప్పారు. పోలీసులు సహకరించారని చెప్పారు.
News December 19, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 168 మంది గైర్హాజరు

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.


