News September 2, 2025
భారత్లో 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2026 ఆగస్టులో ఢిల్లీ వేదికగా ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) ప్రకటించింది. ఈ ఏడాది పారిస్లో జరిగిన పోటీల్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. కాగా భారత్ చివరిగా 2009లో హైదరాబాద్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 15 పతకాలు సాధించింది.
Similar News
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు షురూ..

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.
News September 22, 2025
ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.
News September 22, 2025
INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.