News December 29, 2025

2029లోనూ మోదీ ప్రభుత్వమే: అమిత్ షా

image

ప్రజాసేవ, అభివృద్ధి మంత్రాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేవని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నాయని చెప్పారు. ‘2029లోనూ మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP సూత్రాలతో ప్రజలు కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. అయోధ్య, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు.. అన్నింటినీ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. జనం మద్దతిచ్చే వాటిని వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా పడతాయి’ అని ప్రశ్నించారు.

Similar News

News January 30, 2026

భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

image

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.

News January 30, 2026

మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

image

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News January 30, 2026

వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

image

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.