News January 4, 2026
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. పదేళ్లలో ఫిఫా అండర్-17, హాకీ ప్రపంచ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ.. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు, ఒలింపిక్స్ను నిర్వహించడమే లక్ష్యమని 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.
Similar News
News February 16, 2026
అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.
News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News February 16, 2026
ఆలయ శిఖరం ఎత్తుగా ఎందుకు ఉంటుంది?

ఆలయ నిర్మాణం భగవంతుని శయన రీతిని పోలి ఉంటుంది. గోపురం స్వామి పాదాలకు, గర్భాలయం శిరస్సుకు ప్రతీకలు. గోపురం ఎత్తుగా ఉంటే దూర ప్రాంతాల వారికి సులువుగా తెలుస్తుంది. గోపుర దర్శనం పాద నమస్కారంతో సమానం. ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఎత్తైన ఆలయాలు రక్షణ కేంద్రాలుగా నిలుస్తాయి. దేవుడు సర్వోన్నతుడనే భావనను పెంచేందుకు, భక్తులలో ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం గోపురాలను ఎత్తులో నిర్మిస్తారు.


