News March 22, 2025
2047లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దాం: లంకా

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని, లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మశ పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
విడిపోతున్న జంటలు.. పూజారులు ఏం చేశారంటే?

హలసూరు(KA) సోమేశ్వరాలయంలో ప్రేమ, పెద్దల అంగీకారం లేని జంటల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటల్లో విడాకుల కేసులు విపరీతంగా పెరగడంతో పూజారులు కలత చెందారు. ఈ పవిత్ర స్థలానికి చెడ్డపేరు రావొద్దని పెళ్లిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని విడాకుల కేసుల విచారణ సమయంలోనూ పూజారులను కోర్టుకు పిలుస్తున్నారని, అది కూడా ఓ కారణం అని అధికారులు చెబుతున్నారు.
News December 9, 2025
HYD: ప్చ్.. ఈ సమ్మర్లో బీచ్ కష్టమే!

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.
News December 9, 2025
HYD: ప్చ్.. ఈ సమ్మర్లో బీచ్ కష్టమే!

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.


