News March 22, 2025

2047ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దాం: లంకా 

image

విక‌సిత్ భార‌త్, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేద్దామ‌ని, ల‌క్ష్యాల సాధ‌న‌లో అధికారులే ర‌థ సార‌థుల‌ని ఇర‌వై సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ అన్నారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై స‌మీక్ష  జ‌రిగింది. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మశ పాల్గొన్నారు. 

Similar News

News March 25, 2025

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: మంత్రి అనగాని

image

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెలగపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండకూడదన్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని, 22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్‌- భూవివాదాలు పరిష్కారంపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని సూచించారు.

News March 25, 2025

ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

image

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.

News March 25, 2025

కలెక్టర్ల సమావేశంలో మంత్రి సంధ్యరాణి

image

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రివర్గంతో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

error: Content is protected !!