News November 17, 2024
2,050 ప్రభుత్వ ఉద్యోగాలు.. 23న పరీక్ష

TG: రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. హాల్టికెట్లను <
Similar News
News February 15, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్ను నమ్మొద్దు: కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక రాసిన <<19116627>>కథనాన్ని<<>> భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. పైలట్ కావాలనే ఇంజిన్లు ఆపేశాడన్న వార్తలు అసత్యమని, విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. విదేశీ ఏజెన్సీల ఊహాగానాలను నమ్మొద్దని, దేశీయ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని పౌరవిమానయాన శాఖ సూచించింది. 260 మంది మరణించిన ఈ ఘటనపై తుది నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు వెల్లడిస్తామని పేర్కొంది.
News February 15, 2026
‘బాషా’ నిర్మాత కన్నుమూత

ప్రముఖ తమిళ నిర్మాత, డైరెక్టర్ తమిళ్ అళగన్ కన్నుమూశారు. ఈయన మరణంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అళగన్ ప్రొడ్యూసర్గా బ్లాక్బస్టర్ ‘బాషా’, చిరంజీవి-రజినీ కాంబోలో ‘రానువ వీరన్’(తెలుగులో బందిపోటు సింహం) తదితర చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కాగా తమిళనాట లెజెండరీ ప్రొడ్యూసర్, రచయిత, మాజీ మంత్రి ఆర్ఎమ్ వీరప్పన్ కొడుకే ఈ అళగన్.
News February 15, 2026
భక్తురాలి అమాయకత్వానికి లొంగిపోయిన ఈశ్వరుడు

శివభక్తురాలైన గొడగూచిని తన తండ్రి ఊరెళ్తూ శివలింగానికి పాలు నైవేద్యంగా సమర్పించమని చెబుతాడు. గొడగూచి అమాయకమైన భక్తితో శివుడిని పాలు తాగమని వేడుకొంది. శివుడు పాలు తాగలేదు. దీంతో తనేమైనా తప్పు చేశానేమో అని బాధపడింది. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె చేతి పాలు తాగాడు. అలిగి, అల్లరి చేసిన ఆ చిన్నారి భక్తురాలిని తనలో లీనం చేసుకున్నాడు.


