News June 4, 2024
2,08,460 ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 2,08,460 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితకు 1,62,623 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు 3,71,083 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో మహబూబాబాద్ చివరి ఫలితం విడుదల కానుంది.
Similar News
News November 26, 2025
ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నామినేషన్లు మూడు విడతల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల హ్యాండ్బుక్పై పూర్తి అవగాహనతో తప్పులేని విధంగా పనులు చేయాలని సూచించారు. నగదు-మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టి చెక్పోస్టుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
వరంగల్: ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి!

WGL జిల్లా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు సన్నద్ధమవాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని టెలికాన్ఫరెన్స్లో సూచించారు. కోడ్ అమలు, హోర్డింగుల తొలగింపు, నిఘా బృందాల ఏర్పాటు, మద్యం-డబ్బు పంపకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు.
News November 26, 2025
బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.


