News April 29, 2024

21 నుంచి కళ్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు

image

నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేసి మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Similar News

News November 12, 2025

చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.

News November 12, 2025

చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.

News November 12, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.