News October 3, 2025

21 రహదారుల విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థ తరఫున ప్రతిపాదనలను సహేతుకంగా రూపొందించి నివేదించాలని కలెక్టర్, కమిషనర్ (F.A.C) కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. తొలుత 21 రహదారుల విస్తరణకు సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 3, 2025

కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

image

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.

News October 3, 2025

రాజమండ్రి: ఆటో డ్రైవర్లకు రూ.17 కోట్ల 87 లక్షల ఆర్థిక సాయం

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్లు సేవలో” పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 11,915 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారని జిల్లా రవాణా అధికారి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తం రూ.17,87,25,000ల మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News October 3, 2025

రాజనగరం: ‘ఉమ్మడి జిల్లాలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం’

image

భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ నూతన్ ఉపాధ్యాయులకు విధుల నిర్వహణపై హితబోధ చేశారు. డీఎస్సీ 2025లో ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో 7 సెంటర్లలో శిక్షణ ఇచ్చే కార్యక్రమన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ఐఎస్టీఎస్, బీవీసీ, రైట్, SM, SSP ఇంజినీరింగ్, జీఎస్ఎల్ డెంటల్-2 కాలేజీ సెంటర్లలో 1,672 మందికి శిక్షణ ఇస్తున్నారు.