News April 10, 2025

21-24 ఏళ్ల యువతకు కామారెడ్డి కలెక్టర్ గుడ్ న్యూస్

image

టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ ప్రారంభానికి జిల్లాలో ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21-24 ఏళ్లు ఉండాలన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగయి ఉండకూడదన్నారు. అర్హత గల వారు, సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News December 7, 2025

రెండో విడత.. 415 స్థానాలు ఏకగ్రీవం

image

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.

News December 7, 2025

కోటగుళ్లలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

image

గణపురం మండలం కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి తీర్థప్రసాదాల అందజేశారు.

News December 7, 2025

గద్వాల ఫ్లై ఓవర్ వద్ద సూచిక బోర్డు ఏర్పాటు

image

గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రవీంద్ర పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని, ఆ సమయంలో అవి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాలని ఈ బోర్డు ద్వారా సూచించారు.