News March 19, 2024

21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కొట్టి చూపిద్దాం: పవన్

image

AP: పిఠాపురంతో పాటు 20 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలను గెలిచి చూపిద్దాం అని పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సీట్లను కొట్టి చూపించాలని వారిలో ఉత్తేజం నింపారు. 10 ఏళ్ల ప్రజా పోరాటం తర్వాత అడుగుతున్నానని.. కాకినాడ ఎంపీగా ఉదయ్‌ను, పిఠాపురం ఎమ్మెల్యేగా తనను బలమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను కాపుల్లో పుట్టినా.. ఆ వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యక్తినని చెప్పారు.

Similar News

News November 7, 2025

TODAY TOP STORIES

image

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

News November 7, 2025

మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

image

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్‌ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.